ముక్తేశ్వరాలయంలో చోరీ
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:33 AM
అయినవిల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిలి మండలం ముక్తేశ్వరం శ్రీముక్తికాంత క్షణముక్తేశ్వరాలయంలో చోరీ జరిగింది. స్థానికులు
అయినవిల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిలి మండలం ముక్తేశ్వరం శ్రీముక్తికాంత క్షణముక్తేశ్వరాలయంలో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఆలయం మూసివేసిన సమయ ంలో ఆలయానికి వేసిన తాళాలు బద్దలుకొట్టి దొంగలు చోరీ చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో క్లూస్టీమ్ కె.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో వేలిముద్రలు సేకరించారు. రూ. 1.40లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకుపోయినట్టు తెలిపారు.