Share News

క్రికెట్‌ టోర్నీకి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు..

ABN , Publish Date - May 01 , 2025 | 12:46 AM

వీఆర్‌పురం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన మండలంలోని శబరిరాయిగూడెం గ్రామ సమీపాన జరిగింది. వీఆర్‌పురం ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన ప్రకారం... రామవరం పంచాయతీలోని శబరిరా యిగూడెం గ్రామానికి చెందిన మడకం నరేష్‌ (34), కొ

క్రికెట్‌ టోర్నీకి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు..
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న వీఆర్‌పురం ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌

ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఇద్దరు మృతి

వీఆర్‌పురం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన మండలంలోని శబరిరాయిగూడెం గ్రామ సమీపాన జరిగింది. వీఆర్‌పురం ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన ప్రకారం... రామవరం పంచాయతీలోని శబరిరా యిగూడెం గ్రామానికి చెందిన మడకం నరేష్‌ (34), కొప్పల్లి గ్రామానికి చెందిన కారం చంద్ర య్య (30) వీఆర్‌పురంలో మంగళవారం జరిగిన క్రికెట్‌ టోర్నీకి వెళ్లారు. అనంతరం రాత్రి పది గంటలకు ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తు న్న క్రమంలో శబరిరాయిగూడెం సమీపంలో రేఖపల్లి గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. తీవ్ర గాయాలైనవారిని స్థానికులు చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేష్‌ మృతిచెందా డు. కారం చంద్రయ్యను భద్రా చలం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 12గంట లకు మృతిచెందాడు. కుటుం బసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం మృత దేహాలను బంధువులకు అప్పగించామన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:46 AM