Share News

కొంచెమే పెంపు

ABN , Publish Date - May 30 , 2025 | 12:34 AM

సామర్లకోట, మే 29 (ఆంధ్రజ్యోతి): మే నెలలో ధాన్యానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెరిగింది. క్వింటా లుకు రూ.69 పెరిగింది. గతేడాది గ్రేడ్‌ ఏ రకం ధాన్యానికి రూ.2,320గా కేంద్రం ప్రకటించగా ఈ ఏడాది మరో రూ.69 పెంచడంతో రూ.2,369కి చేరింది. సాధారణ రకం ధాన్యం రూ. 2,183 ఉండగా ఈ ఏడాది రూ.6

కొంచెమే పెంపు

ధాన్యానికి కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

క్వింటాలుకు రూ.69 పెంపు

గ్రేడ్‌ ఏ రకం రూ.2,369

సాధారణ రకం రూ.2,252

ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం

ఉమ్మడి జిల్లాలో 14.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా

పెదవి విరుస్తున్న రైతులు

సామర్లకోట, మే 29 (ఆంధ్రజ్యోతి): మే నెలలో ధాన్యానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెరిగింది. క్వింటా లుకు రూ.69 పెరిగింది. గతేడాది గ్రేడ్‌ ఏ రకం ధాన్యానికి రూ.2,320గా కేంద్రం ప్రకటించగా ఈ ఏడాది మరో రూ.69 పెంచడంతో రూ.2,369కి చేరింది. సాధారణ రకం ధాన్యం రూ. 2,183 ఉండగా ఈ ఏడాది రూ.69 ప్రక టించడంతో రూ.2,252కి చేరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదే శాలతో సీఏపీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బుధవారం సాయంత్రం కనీస మద్దతు ధరలను ప్రకటించింది. తాజా మద్దతు ధరతో రానున్న 2025 -26 ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాల్సిఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5.54 లక్షల ఎకరాల పరిధి లో 14.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ప్రభావం లేకపోతే ఎకరాకు వరికి 4.5 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర క్వింటాలుకు రూ.69 పెంచడంతో ఉమ్మడి జిల్లాలో రైతుల కు రూ.180కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

సాగు ఖర్చులతో పోలిస్తే...

వరి మొక్కజొన్న తదితర 16 పంటలకు సంబంధించి మద్దతు ధరలను పెంచుతూ వ్యవసాయ, వ్యయ ధరల కమిషన్‌ (సీఏ పీసీ) కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి రూ.8,768గా నిర్ణయించింది. గతే డాది పెసలు క్వింటాలుకు రూ.8,682గా ఉంది. పెసలపై 8 శాతం పెంచగా, వరికి కేవలం 6 శాతం మాత్రమే పెంచింది. ఈ పెంపుదల ధరలు వరికే అత్యధికం అని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పెరి గిన సాగుఖర్చులుతో పోలిస్తే ఇది ఏమంత అధి కం కాదని రైతులు చెప్తున్నారు. ఈ సిఫార్సు లను కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో సాధార ణ రకం, గ్రేడ్‌ ఏ రకాలకు ప్రస్తుతం చెల్లి స్తున్న ధర కంటే రూ.69 చొప్పున పెంచ డానికి సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లా లో సుమారు 330 ధాన్యం కొనుగోలు కేంద్రా ల వరకూ ఏర్పాటు చేసి ప్రభుత్వం గతంలో ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుంచి దాన్యం కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేపట్ట లేకపోగా రానున్న ఖరీఫ్‌ నాటికి 5.54 లక్షల ఎకరాల్లో సాగు ద్వారా వచ్చే 16.00 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తులను ప్రభు త్వం కొనుగోలు చేయనున్నది. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.69 మాత్రమే పెంపుదల చేయడంతో రైతాంగం పెదవి విరు స్తుంది. సాగుకు పెట్టుబడులు అధికమవుతున్న తరుణంలో అందుకు తగ్గట్టుగా మద్దతు ధర లభించడం లేదని రైతులు, రైతు సంఘాల ప్రతి నిధులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయాన్ని మరింత అభి వృద్ధి చేసేందుకు ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం అయినా చేయకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తు ందని పాలకర పభుత్వాలపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతి చమురు వదిలించుకోవాల్సిందే...

ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన వరిపంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా, ఏటా మిల్లర్లు రైతులకు మద్ద తు ధర అందివ్వని పరిస్థితి నెలకొంది. రైతు సేవా కేం ద్రాల ద్వారా మిల్లర్లకు ధాన్యాన్ని అందజేస్తున్నా, తమకు మాత్రం మద్దతు కరువవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం ఎకరాకు సగటున 48 బస్తాల వరకూ దిగుబడులు వస్తాయని వ్యవ సాయ శాఖ అంచనా వేయగా క్వింటాలుకు కేం ద్రం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్‌ ఏ రకానికి 2,389 ప్రకారం బస్తాకు రూ.1,791.75 వస్తుంది. మొత్తం 48బస్తాలకు రూ.86,004 వస్తుంది. కానీ ఎకరానికి పెట్టుబడిగా రూ.70వేల వరకూ పెట్టుబడి వ్యయం అవుతుండగా, రైతుకు మిగి లేది కేవ లం 16,004 మాత్రమే. అదే రైతు కూలీ పనులకు వెళితే పంట సాగుకాలంలో రూ.80 వేల వరకూ వచ్చే అవకా శాలు ఉన్నాయి. అది కూడా ఏ-గ్రేడ్‌ రకానికి మాత్రమే సొంతభూమి సాగు చేసుకునే రైతుకు కొంత మిగులు కనిపి ంచే అవకాశం ఉండగా కౌలు రైతు, ప్రభుత్వం ముద్దుగా పిలుచుకొనే సాగుహక్కుదారుడు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. సా ధారణంగా ఖరీఫ్‌లో సాగు హక్కుదారులకు ఏమీ మి గలదు. రబీలో లాభం ఉం టుందనే ఆశతోనే సాగు లోకి దిగుతారు. అన్ని అవ రోధాలను దాటుకుని సాగు చేసినా చేతికి మిగిలేది రెం డు పదులు కూడా దాటని పరిస్థితి. అయితే మద్దతు ధర గణనీయంగా పెరిగి తేనే రైతులకు ఎంతోకొంత మిగులుతుంది.

మిగిలిన పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు

మొక్కజొన్న క్వింటాకు రూ.175

కందులు క్వింటాకు రూ.450

మినుములు క్వింటాకు రూ.400

వేరుశెనగ క్వింటాకు రూ.480

పత్తి క్వింటాకు రూ.589

Updated Date - May 30 , 2025 | 12:34 AM