పాపం వారిది.. శాపం వేరొకరికి!
ABN , Publish Date - May 27 , 2025 | 01:09 AM
రాజమహేంద్రవరం, మే 26 (ఆంధ్రజ్యోతి): యంత్రాంగం అలసత్వం పరోక్షంగా నలుగురు చనిపోవడానికి, ఒకరు నిందితు డిగా మారడానికి, విద్యార్థి అనా థగా మిగలడానికి కారణ మైం ది. తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం ఆటోనగర్ జం క్షన్ను రోడ్డు రవాణా అధి కారు లు, పోలీసులు చెకింగ్ అడ్డాగా మార్చుకున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా వసూళ్లు చేస్తూ చలాన్లు రాస్తారు. దివాన్ చెరువు వైపు నుంచి వచ్చేటప్పుడు సరిగ్గా మ లుపు తిరిగిన
ఆటోనగర్ జంక్షన్ వద్ద అధికారులు, పోలీసుల వసూళ్లు
కంగారు పడుతున్న లారీ డ్రైవర్లు.. అటుపై ప్రమాదాలు
రాజమహేంద్రవరం, మే 26 (ఆంధ్రజ్యోతి): యంత్రాంగం అలసత్వం పరోక్షంగా నలుగురు చనిపోవడానికి, ఒకరు నిందితు డిగా మారడానికి, విద్యార్థి అనా థగా మిగలడానికి కారణ మైం ది. తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం ఆటోనగర్ జం క్షన్ను రోడ్డు రవాణా అధి కారు లు, పోలీసులు చెకింగ్ అడ్డాగా మార్చుకున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా వసూళ్లు చేస్తూ చలాన్లు రాస్తారు. దివాన్ చెరువు వైపు నుంచి వచ్చేటప్పుడు సరిగ్గా మ లుపు తిరిగిన తర్వాత యూనిఫాం సర్వీసు వా రు కనిపిస్తారు. ఆ మలుపు నుంచి 70 మీటర్ల దూరంలోనే వీళ్లు ఉండడంతో వాహనదారులు.. ముఖ్యంగా లారీల డ్రైవర్లు కంగారుపడుతూ ఉంటారు. సోమవారం జరిగిన ప్రమాదం కూడా దాని పర్యావసానమే. బొగ్గు లోడుతో విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీ డ్రైవరు రోడ్డు రవాణా సిబ్బందిని చూసి ఒక్క సారిగా కంగారుపడి (బొగ్గు లోడుకు తగిన అనుమతులు లేవని చెబుతున్నారు) సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో 60 మీటర్ల దూరం నుంచి రోడ్డుపై చారను పెట్టుకుంటూ వెళ్లి కారును ఢీకొని మరొక 10మీటర్లు రోడ్డు కిందకు తోసుకు పోయింది. ఇదే ప్రదేశంలో 3 రోజుల క్రితం ఒక లారీ డ్రైవరు పోలీసులను చూసి సడెన్ బ్రేక్ వేయగా వెనుక వచ్చే కారు ఆ లారీని వెనుక నుంచి ఢీకొందని,సెటిల్మెంట్ చేసి పంపేశారని స్థానికులు చెప్తున్నారు. ఇదే ప్రదేశంలో గత నెల రోజుల్లో ఇది మూడో ప్రమాదమని అంటు న్నారు. రాత్రి వేళల్లో గస్తీ అంటూ లారీల వద్ద వసూళ్ల కోసం ఇక్కడే కాపు కాస్తుంటారు. ఒక్క సారిగా పోలీసులు కనబడడంతో లారీ డ్రైవర్లు కంగారు పడుతున్నారు. తనిఖీ వారికి డబ్బులు ఇవ్వడం కోసం కొందరు లారీ డ్రైవర్లు ఉన్న పళంగా బ్రేకును నొక్కి రోడ్డు వారకు నిలుపుతు న్నారు. ఆ సమయంలో వెనుక వచ్చే వాహనా లు కంట్రోల్ కావడం ఇబ్బందవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారి ఆర్ అండ్ బీ పరిధిలోకి వస్తుంది. గామన్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుగా పిలుస్తారు. కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వరకూ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇటీవల పాస్టర్ ప్రవీ ణ్ మృతిచెందిన ప్రదేశం ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటరు మాత్రమే ఉం టుంది. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా నలు గురు చనిపోయే వరకూ యంత్రాంగం కళ్లు తె రవకపోవడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.