రేపు జిల్లా అంతటా పల్స్ పోలియో
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:57 AM
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 21న పల్స్పోలియా కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు.
అమలాపురం,డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 21న పల్స్పోలియా కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లంలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు దీన్ని విజయవంతం చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావుదొర, ఇమ్యునైజేషన్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.