పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల
ABN , Publish Date - May 02 , 2025 | 01:41 AM
కూటమి ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా 1న పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు అన్నారు.
మండపేట, మే, 1(ఆఽంధ్రజ్యోతి) కూటమి ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా 1న పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు అన్నారు. ఏడిదలో గురువారం జరిగిన పెన్షన్ల పంపిణీలో నూతనంగా మంజూరైన పింఛన్ లను లబ్ధిదారు లకు అందించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు పర్వతిన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనా సత్య నారాయణ, వార్డు ఇన్చార్జిలు బి.రామకృష్ణ తదితరుల సారధ్యంలో వార్డులో పింఛన్ల పంపిణీ నిర్వహించారు.