Share News

నిలిచిన పాపికొండల పర్యాటకం

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:26 AM

దేవీపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పాపికొండలు పర్యాటకానికి టిక్కెట్ల కొనుగోలు లేకపోవడంతో నిలిచింది. గోదావరి వరదల కారణంగా గత 3నెలల నుంచి

నిలిచిన పాపికొండల పర్యాటకం
పోశమ్మగండి బోటు పాయింట్‌ వద్ద నిలిచి ఉన్న బోట్లు

వర్షాల కారణంగా రాని పర్యాటకులు

దేవీపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పాపికొండలు పర్యాటకానికి టిక్కెట్ల కొనుగోలు లేకపోవడంతో నిలిచింది. గోదావరి వరదల కారణంగా గత 3నెలల నుంచి పాపికొండలు విహారయాత్రకు బ్రేక్‌ పడింది. అయితే ఇటీవల గోదావరి తగ్గుముఖం పట్టడంతో 2 రోజుల క్రితం పాపికొండలు పర్యాటకానికి అధికారులు పచ్చజెండా ఊపారు. ప్రస్తు తం వర్షాల కారణంగా పర్యాటకులు పాపికొండలు పర్యాటకానికి ముం దుకురాకపోవడంతో బోట్లన్నీ బోటు పాయింట్‌ వద్దే నిలిచిపోయాయి.

Updated Date - Oct 14 , 2025 | 12:26 AM