Share News

మే 10న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:44 AM

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21(ఆంధ్ర జ్యోతి): మే 10న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కా రమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత ఆదేశించారు. ఈ మేరకు బ్యాం

మే 10న జాతీయ లోక్‌ అదాలత్‌
సమావేశంలో మాట్లాడుతున్న పీడీజే సునీత

అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం కావాలి : పీడీజే సునీత

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21(ఆంధ్ర జ్యోతి): మే 10న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కా రమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత ఆదేశించారు. ఈ మేరకు బ్యాంకులు, విద్యుత్తు, టెలీఫోన్‌ శాఖల ప్రతినిధులతో డీఎల్‌ఎస్‌ఏ ఇంచార్జి కార్యదర్శి బి.పద్మ, పీడీజే సోమవారం సమావేశం నిర్వహించారు. బాధి తులకు తగు పరిహారం అందించడంపై కూడా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన అన్ని కేసులను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలుతీసుకోవాలని ఆమె సూచించారు.

Updated Date - Apr 22 , 2025 | 12:45 AM