రాష్ట్రంలో మంచి పాలన
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:34 AM
నల్లజర్ల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ద్వారకా తిరుమల చి నవెంకన్న ఆలయానికి వెళితే ఎక్కడా పవిత్రత అనేది కనిపించలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో మం చి పాలన కొనసాగిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీం ద్ర అన్నారు. ఆదివారం తూ ర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం లో గంగాలమ్మ తల్లి జాతరకు ఆయనతో పాటు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి పీతల సుజాత, జిల్లా పరిషత్ చైర్మన్
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
గంగాలమ్మతల్లి జాతరలో ప్రత్యేక పూజలు
నల్లజర్ల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ద్వారకా తిరుమల చి నవెంకన్న ఆలయానికి వెళితే ఎక్కడా పవిత్రత అనేది కనిపించలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో మం చి పాలన కొనసాగిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీం ద్ర అన్నారు. ఆదివారం తూ ర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం లో గంగాలమ్మ తల్లి జాతరకు ఆయనతో పాటు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి పీతల సుజాత, జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మ శ్రీ, రాష్ట్ర అంగన్వాడీ విభాగ అధ్య క్షురాలు ఆచంట సునీత హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడు తూ కులమతాలకతీతంగా సంప్రదాయాన్ని గౌర వించడంతో పాటు ఆలయాల పవిత్రతను కాపాడాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు అదే ఆలయానికి వెళితే మనస్సుకు ప్రశాంతత కలిగిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టొద్దన్నారు. అందుకు భగవంతుడు తగిన బుద్ధి చెప్పి ఇం టికి పంపించాడన్నారు. అందుకే 164 సీట్లను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.259 కోట్ల మత్స్యకార కుటుం బాలకు రూ.20 వేలు చొప్పున అందించిన ఘన త సీఎం చంద్రబాబుదే అన్నారు. ఘంటవారి గూడెంలో 100ఏళ్ల తరువాత జాతర జరగడం ఆనందదాయకమన్నారు. టీడీపీ మండలాధ్యక్షు డు తాతిన సత్య నారాయణ, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరా సాహెబ్, కూచిపూడి ఉదయ భాస్కర్,నాదెళ్ల శ్రీరామ్చౌదరి తదితరులున్నారు.