కిక్కిరిసిన మందపల్లి ఆలయం
ABN , Publish Date - May 25 , 2025 | 12:58 AM
మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనిత్రయోదశి సందర్భంగా శనివారం భక్తులు పోటె త్తారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వదర్శనాలు, తైలాభిషేకాలకు బారులుతీరారు.
కొత్తపేట, మే 24(ఆంధ్రజ్యోతి): మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనిత్రయోదశి సందర్భంగా శనివారం భక్తులు పోటె త్తారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వదర్శనాలు, తైలాభిషేకాలకు బారులుతీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక పూజ లు జరిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.8,22,893 ఒక్కరోజు ఆదా యం వచ్చినట్లు ఆలయ సహాయ కమీషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.