రేపటి నుంచి కోటసత్తెమ్మ తిరునాళ్లు
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:37 AM
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోట సత్తెమ్మ తిరునాళ్లు 4వ తేదీ గురువారం నుంచి 8వ తేదీ సోమవారం వరకు ఘనంగా నిర్వహిస్తామని ఫౌం డర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు.
నిడదవోలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోట సత్తెమ్మ తిరునాళ్లు 4వ తేదీ గురువారం నుంచి 8వ తేదీ సోమవారం వరకు ఘనంగా నిర్వహిస్తామని ఫౌం డర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు. గురువారం ఉదయం దేవులపల్లి రవిశంకర్ దంపతులచే వైదిక స్మార్త ఆగమ ఆచా రం ప్రకారం కలశ స్థాపనతో తిరునాళ్లు ప్రారంభమవుతాయి. 5వ తేదీ శుక్రవారం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం, మాంగల్యదేవి అమ్మవారి దేవస్థానం వారిచే కోటసత్తెమకు చీర, సారె సమర్పణ, 6వ తేదీ నిడదవోలు ఆర్య వైశ్య సంఘంచే చీర సారె సమర్పణ, 7వ తేదీ ఆదివారం అఖిలభారత తెలుగు సేవా ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు అడ్వకేట్ జి.ఆదిలక్ష్మి ఆధ్వ ర్యంలో రాజమండ్రి నుంచి 101 మంది మహిళలచే చీర, సారె, కలశాలతో బోనం సమర్పణ, 8వ తేదీ సోమవారం వివిధ మేళాలతో గరగ ఉత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారి తిరునాళ్లు ఐదు రోజులు ఉదయం చండీపారాయ ణం, సాయత్రంం చండీ హోమం, అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.