Share News

రూ.1.30కోట్లతో రెడ్‌క్రాస్‌ భవనం

ABN , Publish Date - May 10 , 2025 | 12:12 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 9 (ఆంధ్ర జ్యోతి): రెడ్‌క్రాస్‌ కాకినాడ జిల్లా శాఖ రూ.1.30 కోట్లతో కాకినాడలో మూడు అంతస్తుల్లో శిశు సంరక్షణ, మహిళా సంక్షేమ, శిక్షణ కేంద్రాన్ని ని ర్మించింది. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో దీనిని గవర్నర్‌ ఎస్‌. అబ్దు

రూ.1.30కోట్లతో రెడ్‌క్రాస్‌ భవనం
విజయవాడలో భవనాన్ని ప్రారంభిస్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 9 (ఆంధ్ర జ్యోతి): రెడ్‌క్రాస్‌ కాకినాడ జిల్లా శాఖ రూ.1.30 కోట్లతో కాకినాడలో మూడు అంతస్తుల్లో శిశు సంరక్షణ, మహిళా సంక్షేమ, శిక్షణ కేంద్రాన్ని ని ర్మించింది. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో దీనిని గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ తన సతీమణితో కలిసి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి, రెడ్‌క్రాస్‌ జిల్లా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వైడీ రామారావు, భవన నిర్మాణ దాతలు డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి, ఓఎన్జీసీ చీఫ్‌ జనరల్‌ మేనేజరు జి.భాస్కర్‌రావు జెమినీ ఎడిబుల్‌ ఆయిల్స్‌ జనరల్‌ మేనేజరు ఎన్‌.గురుప్రసాద్‌, గవర్నర్‌ కార్యదర్శి హరి జనహర్‌లాల్‌, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీదా, కోశాధికారి పి.రామచంద్రరాజు పాల్గొన్నారు. కింది అంతస్తులో శిశు గృహ ఏర్పాటు చేస్తున్నామని, మొదటి అంత స్తులో మహిళా శిక్షణ కేంద్రం, రెండో అంతస్తు లో మహిళా అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహి స్తామని కలెక్టర్‌ షాన్‌మోహన్‌, చైర్మన్‌ వైడీఆర్‌ గవర్నర్‌కు తెలిపారు. కాకినాడ శాఖ చేస్తున్న కార్యక్రమాలను గవర్నర్‌ ప్రశంసించి భవన ని ర్మాణదాతలకు పుష్పగుచ్ఛాలిచ్చి సత్కరించారు.

Updated Date - May 10 , 2025 | 12:12 AM