ఏడాదికే శిథిలావస్థకు..
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:07 AM
గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. వాటిలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ ఆర్అండ్బీ వాంబే కాలనీలోని కమ్యూనిటీ హాలు ఒకటి. దానిని 2021లో రూ.1.05 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించారు. అయితే ఆ హాలు చూస్తే పైభాగంలో రేకుల షెడ్డు మాదిరిగా ఉంది. అయితే ఏడాదికే పూర్తిగా పా డై వినియోగించుకోవడానికి వీలులేకుం డా మారింది.
ఆర్అండ్బీ వాంబే కాలనీలో కమ్యూనిటీహాలు దుస్థితి
కొంతకాలంగా నిరూపయోగం
రూ.1.05 కోట్లు వృథా
గత ప్రభుత్వ నిర్వాకం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 14( ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. వాటిలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ ఆర్అండ్బీ వాంబే కాలనీలోని కమ్యూనిటీ హాలు ఒకటి. దానిని 2021లో రూ.1.05 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించారు. అయితే ఆ హాలు చూస్తే పైభాగంలో రేకుల షెడ్డు మాదిరిగా ఉంది. అయితే ఏడాదికే పూర్తిగా పా డై వినియోగించుకోవడానికి వీలులేకుం డా మారింది. దీంతో కొంత కాలంగా ఈ కమ్యూనిటీ హాలు మూతపడిం ది. నాశిరకం మెటిరీయల్ వి నియోగించడం వల్ల పాడైనట్టు తెలుస్తోంది. రూ.50 లక్షలతో చేసే దానికి గత ప్రభుత్వంలో కోటి ఖర్చుపెట్టినట్టు చూపించారు. ఈ హాలును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తే ఆర్అండ్బీ వాంబే కాలనీతోపాటు ఇందిరా నగర్, లూధర్గిరి, సొసైటీ బిల్డింగ్ తదితర ప్రాంతాల ప్రజలకు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
రూ.35 లక్షలతో మరమ్మతులు
వాంబేకాలనీలో పూర్తిగా పాడైన కమ్యూనిటీ హాలును ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇటీవల పరిశీలించారు. హాలును స్థానికులకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పేపరు మిల్లు సీఎస్ఆర్ నిధులు రూ.35 లక్షలు కేటాయించి కమ్యూనిటీ హాలుకు మరమ్మతులు చేపట్టారు.