నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం
ABN , Publish Date - May 10 , 2025 | 01:13 AM
రాష్ట్రం లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

1038 మందికి ఉద్యోగాలు
త్వరలో టూరిజం జాబ్మేళా
మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, మే 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి దుర్గేష్ జ్యోతి ప్రారంభించి మాట్లాడారు. జాబ్ మేళాకు సుమారు 42 కంపెనీలు హాజరయ్యాయని ఆయా కంపెనీల్లో రెండు వేలకు పైగా ఉద్యోగా వకాశాలు కల్పిస్తారన్నారు.ఈ జాబ్ మేళాలో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు అధికంగా వచ్చాయని..త్వరలో నిర్వహించే మరో జాబ్ మే ళాలో టూరిజం, ఆతిఽథ్య రంగాలకు సంబం ధిం చిన కంపెనీలను ఆహ్వానిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లా డు తూ కూటమి ప్రభుత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు. అనంతరం జాబ్ మేళాలో కార్పోరేట్ కంపెనీలు నిర్వహించిన ఇంటర్య్వూలకు 2386 మంది హాజరుకాగా 1038 మంది ఉద్యోగాలు సాధిం చారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వికాస పీడీ కె.లచ్చా రావు,జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మురళి, కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ రుద్ర, డాక్టర్ కె.జ్యోతి, నాయకులు పాల్గొన్నారు.