జల ప్రహార్.. సైనికా జోహార్!
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:38 AM
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ డీప్ సముద్రంలో భారత నౌకా దళం ఆఽధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఉభయ చర వ్యాయామం (జల ప్రహార్-25) యుద్ధ విన్యాసాలు విజయవంతంగా ముగిసినట్టు అధి కారులు తెలిపారు. ఉమ్మడి సైనిక విన్యాసం, యుద్ధ సన్నదతను మరింత మెరు
కాకినాడ తీరంలో ముగిసిన యుద్ధ విన్యాసాలు
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ డీప్ సముద్రంలో భారత నౌకా దళం ఆఽధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఉభయ చర వ్యాయామం (జల ప్రహార్-25) యుద్ధ విన్యాసాలు విజయవంతంగా ముగిసినట్టు అధి కారులు తెలిపారు. ఉమ్మడి సైనిక విన్యాసం, యుద్ధ సన్నదతను మరింత మెరుగుపరచడానికి ఈ విన్యాసాలను ఏటా భారత త్రివి ధ దళాల ఆధ్వర్యంలో కాకినాడ సముద్ర తీరంలో నిర్వహి స్తున్నాయి. దైవార్షిక ఉమ్మడి వ్యాయామం జల ప్రహార్ను భారత దేశ తూర్పు సముద్ర తీరంలో ఉభయచర కార్యకలాపాల్లో సెంటర్-సరీస్ సినర్జీ, కార్యాచరణ ప్రణాళిక అమలును ధృవీకరించడం, త్రివిధ దళాల సన్న ద్ధతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుని సెప్టెంబరు 21-23 వరకు కాకినాడ సముద్ర మధ్యభా గంలో విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎ న్ఎస్ ఘరియల్లోకి సైన్య దళాలను ప్రవేశ పెట్టడం, ఏకీకృతం చేయడం చేశారు. ఈ విన్యా సాల్లో భాగంగా ఆన్బోర్డు శిక్షణ, భద్రతా బ్రీఫిం గ్లు, నావికుడి జీవితం వైపు దృష్టి సారిం చడం, క్రీడలు, స్నేహాన్ని పెంపొం దించేందుకు ఈ ఉమ్మడి పరస్పర విన్యాసాలు ఎంతగానో దోహద పడతాయని అధికారులు తెలిపారు. విన్యాసాల్లో భాగంగా సముద్రతీరంలో హార్డ్ బీచింగ్, ఎన్సీల, బీఎంపీలను ప్రారంభించి, ఎస్ఓపీలు, ఉమ్మడి శిక్షణ అంతా ఒక పద్ధతిలో విన్యాసాలు నిర్వహిం చినట్లు త్రివిధ దళాల అఽధికారులు తెలిపారు. ఈ వ్యాయామం రెండు దశల్లో నిర్వహించగా, మొద టి దశలో ఈనెల 16నుంచి 20 వరకు విశాఖ ప ట్నంలో హార్బర్దశలో చేయడం జరిగిందన్నారు.