Share News

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:18 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని రామవరం పీహెచ్‌సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించి సిబ్బంది హాజరుపై ఆరా తీశారు.

 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
రామవరం పీహెచ్‌సీలో మహిళతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు

అనపర్తి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని రామవరం పీహెచ్‌సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించి సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, గర్భిణులకు అందించే సేవలు మెరుగు పడాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రం గా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ మీనాక్షి, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 01:18 AM