కత్తితో పొడిచి చంపేసి.. కారులో తెచ్చి పడేసి..!
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:49 AM
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతుడు అనకాపల్లి జిల్లా వాసిగా... అతడిని భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఇంటి వద్ద హతమార్చి చేబ్రోలు బైపాస్లో పడవేసినట్టు విచారణలో పోలీసులు గు
వీడిన చేబ్రోలు బైపాస్ హత్య కేసు మిస్టరీ
మృతుడు అనకాపల్లి జిల్లా వాసిగా గుర్తింపు
భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి హతమార్చిన వైనం
యలమంచిలిలో మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతుడు అనకాపల్లి జిల్లా వాసిగా... అతడిని భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఇంటి వద్ద హతమార్చి చేబ్రోలు బైపాస్లో పడవేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. 2 నెలల తర్వాత కేసు దర్యాప్తు కొలిక్కివచ్చింది. కేసును గొల్లప్రో లు పోలీసుస్టేషన్ నుంచి యలమంచిలి పోలీసుస్టేషన్కు బదిలీ చేయనున్నట్టు సమాచారం.
అసలేం జరిగిందంటే..?
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రో లు బైపాస్లో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మార్చి 3న లభ్యమైంది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. మృతదేహంపై ఉన్న గాయాలు, పడి ఉన్న తీరు తదితర అం శాలను పరిశీలించిన పోలీసులు అతడిని హత్య చేసినట్టు గుర్తించారు. ఎస్పీ బిందుమాధవ్, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృం దాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మృతుడి వివరాలు లభ్యం కాలేదు. సీసీ పుటేజీలు, అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, సెల్టవర్ సిగ్నల్స్ ఆ ధారంగా సీఐ శ్రీని వాస్, గొల్లప్రోలు ఎస్ ఐ రామకృష్ణ, పోలీసులతో కూడిన బృందం చేసిన విచారణలో ఎర్ర కారు, ఇతర ఇతర ఆధారాలు లభ్య మైనప్పటికీ వాటి ఆధారంగా కేసు ముందుకు వెళ్లలేదు. ఈలోగా సోమవారం సాయంత్రం యలమంచిలి పోలీసుస్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. తన కుమారుడు తంగెళ్ల లోవరాజు ఫిబ్రవరి 28 నుంచి కనిపించట్లేదని అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్ఐ ఆ వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఫిబ్రవరి 28నే లోవరాజును హత్య చేసి ఇక్క డకు తీసుకువచ్చి పడవేసినట్టు గుర్తించారు.
వివాహేతర సంబంధం బయటపడిందని..
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకా రం.... అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తంగెళ్ల లోవరాజు (37), ఏలూరుకు చెందిన శ్యామలకు వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలన్నారు. శ్యామలకు బావ వరుసైన మోహనకుమార్తో వివాహేతర సంబ ంధం ఉంది. దీనిని గుర్తించిన లోవరాజు మరోమారు కనిపిస్తే చంపేస్తానని ఇద్దరినీహెచ్చరించాడు. ఇది మనసులో ఉంచుకుని ఫిబ్రవరి 28 న ఫార్మా కంపెనీలో పని చేసి రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయిన లోవరాజును శ్యామల, మో హనరావు కత్తితో పొడిచి చంపేశారు. వారికి మోహనకుమార్ వద్ద పనిచేసే గంగాధర్ సహకరించాడు. చనిపోయిన లోవరాజుని మోహనకుమార్ ఎర్ర కారులో తీసుకుని చేబ్రోలు బైపాస్ రోడ్డులోకి తీసుకువచ్చి అక్కడ పడవేశారు. ఏమీ తెలియనట్లు శ్యామల ఇంటికి వచ్చి ఉద యమే ఇల్లు కడుగుతుండగా లోవరాజు తల్లి కుమారుడి గురించి ఆరా తీసింది. అప్పుడే బయటకు వెళ్లినట్లు చెప్పడం, అదే సమయంలో రక్తపు మరకలు కనిపించడంతో ప్రశ్నించగా పిల్లి చనిపోయిందని శ్యామల తెలిపింది. అప్పటి నుంచి కుమారుడు ఇంటికి రాకపోవడం, కోడలి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో లోవరాజు తల్లి సోమవా రం యలమంచిలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చే సింది. దీంతో గొల్లప్రోలు, యలమంచిలి పోలీసులు లోవరాజు భార్య శ్యామల, మోహనరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత బుకాయించినప్పటికీ అన్ని ఆధారాలను పోలీసులు ముందుంచడంతో నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. గంగాధర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో నమోదైన కేసును యలమంచిలి పోలీసుస్టేషన్కు బదిలీ చేయనున్నట్టు చెప్తున్నారు. కేసును దర్యాప్తు చేసి విచారణను కొలిక్కి తీసుకొచ్చిన సీఐ, ఎస్ఐ, విచారణ బృందంలోని ఇ తరసభ్యుల్ని ఉన్నతాధికారులు అభినందించారు.