Share News

గంజాయితో ఐదుగురి అరెస్ట్‌

ABN , Publish Date - May 24 , 2025 | 12:32 AM

ఆలమూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా ఆలమూరు పోలీసులు శనివారం గంజాయితో ఐదుగురిని అరెస్టు చేసినట్లు కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను ఆలమూరు పోలీస్టేషన్‌లో రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌.విద్యాసాగర్‌, ఆలమూరు ఎస్‌ఐ ఎం.అశోక్‌ విలేకర్లకు వివరించారు. గంజాయితో ఉన్నట్టు సమాచా

గంజాయితో ఐదుగురి అరెస్ట్‌
ఆలమూరులో వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్‌ఐ

ఆలమూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా ఆలమూరు పోలీసులు శనివారం గంజాయితో ఐదుగురిని అరెస్టు చేసినట్లు కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను ఆలమూరు పోలీస్టేషన్‌లో రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌.విద్యాసాగర్‌, ఆలమూరు ఎస్‌ఐ ఎం.అశోక్‌ విలేకర్లకు వివరించారు. గంజాయితో ఉన్నట్టు సమాచారం రావడంతో పెదపళ్ల శివారు శ్మశానవాటిక వద్ద దాడి చేసి కడి యం మండలం మురమండకు చెందిన నూకపెయ్యి దిలీప్‌, ఆలమూరు మండలం పెదపళ్లకు చెందిన చాపల ప్రసన్నకుమార్‌, పల్లి కార్తీక్‌కుమార్‌, కపిలేశ్వరపురం మండలం తాతపూడికి చెందిన ఉందుర్తి ఆనంద్‌కుమార్‌, కడియం మండలం దుళ్లకు చెందిన మెండి రవికుమార్‌లను అరెస్ట్‌ చేశారు. ఒక్కొక్కరి వద్ద 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరచినట్టు పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:32 AM