Share News

రైలులో గంజాయి రవాణా

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:21 AM

సామర్లకోట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కా కినాడ జిల్లా సామర్లకోట మీదుగా యశ్వంత్‌ పూర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో పెద్దఎత్తున గం జాయి రవాణా చేస్తున్నారన్న శుక్రవారం రాత్రి 10 గంటలకు వచ్చిన సమాచారంతో సామర్ల కోట రైల్వే ప్రోటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తం

రైలులో గంజాయి రవాణా
సామర్లకోట రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న గంజాయితో పోలీసులు

రూ.7 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న సామర్లకోట పోలీసులు

సామర్లకోట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కా కినాడ జిల్లా సామర్లకోట మీదుగా యశ్వంత్‌ పూర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో పెద్దఎత్తున గం జాయి రవాణా చేస్తున్నారన్న శుక్రవారం రాత్రి 10 గంటలకు వచ్చిన సమాచారంతో సామర్ల కోట రైల్వే ప్రోటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా రైలులో తనిఖీలు ని ర్వహించారు. ఎస్‌-1 బోగీ నుంచి ఎస్‌-6 బోగీ ల వరకూ సీట్ల కింద తనిఖీలు నిర్వహించగా 140 కిలోల పరిమాణంలో 15 బాక్స్‌లుగా ప్యాక్‌ చేసి గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించి స్వాధీ నం చేసుకున్నారు. ఆయా సీట్ల వద్ద ఉన్న ప్రయాణికులను ఆరా తీయగా తమకేమీ సంబ ంధం లేనట్టు చెప్పారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని రైలు నుంచి కిందికి దింపి రైల్వే పోలీస్టేషన్‌కు తరలించామ న్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.7 లక్షల మేర ఉంటుందని పోలీ సులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజా యి రవాణా చేస్తున్న వారెవ్వరూ పట్టుబడకపో వడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న గంజా యిని శనివారం సామర్లకోట మండల మెజిస్ట్రేట్‌ ఎదుట ఉంచుతామని, కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 12:21 AM