Share News

వరద నీటిలోనే గండిపోశమ్మ ఆలయం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:29 AM

దేవీపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది.

వరద నీటిలోనే గండిపోశమ్మ ఆలయం
గండిపోశమ్మ ఆలయం

దేవీపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. వ్యాపారులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. గ్రామాల సమీపంలో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు గోదావరి ఉగ్రరూపం దాల్చడం తో గోదావరి పరీవాహక ప్రాంతాలైన కొండమొదలు నుంచి పోశమ్మగండి వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మాతృశ్రీ గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వరద నీటిలోనే ఉంది. దండంగి-రావిలంక ప్రధాన రోడ్డుపై భారీగా వరద నీరు చేరుకుంది.

Updated Date - Aug 19 , 2025 | 12:29 AM