రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:07 AM
రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉం టుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
ఆలమూరు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉం టుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇందులో భాగంగా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. ఆలమూరులో మంగళ వారం రైతులకు ఆరు పవర్ టిల్లర్స్ను అందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి లక్ష్మీలావణ్య, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, ఎంపీడీవో ఎ. రాజు, కూటమి నాయకులు, పలువురు అధికారులు తదిత రులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు: ఆలమూరు మండలం గుమ్మిలేరులో వాటర్ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మోదుకూరులో ఎన్టీఆర్ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ల ను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.