హైవేపైకి ఏలేరు వరద నీరు
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:10 AM
గొల్లప్రోలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో 216వ జాతీయ రహదారిపైకి శుక్రవారం మధ్యా
గొల్లప్రోలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో 216వ జాతీయ రహదారిపైకి శుక్రవారం మధ్యా హ్నం ఏలేరు వరద నీరు చేరింది. ఏలేరు కాలువలకు గండ్లు పడడంతో పొలాల మీదుగా వచ్చి న వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. రైతులు గట్లుపై ఇసుకబస్తాలు వేసి నీరు రాకుండా కట్ట డి చేయడంతో రహదారిపై నీరు సాయంత్రం నుంచి పెరగలేదు. లేకుంటే జాతీయ రహదారిపై ఒకవైపు వరద నీరు ప్రవహించేదని అధికారులు తెలిపారు.