ఏలేరులో పెరుగుతున్న నీటి నిల్వలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:18 AM
ఏలేశ్వరం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏలేరుజలాశయంలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మెస్తారు వర్షాలు, గోదావరి జలాలు విడుదల చేస్తుండడంతో రిజర్వాయర్లోని నీరు పెరుగుతోం ది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు 1225 క్యూసెక్కులు ఏలేరు జలాశయానికి
ఏలేశ్వరం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏలేరుజలాశయంలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మెస్తారు వర్షాలు, గోదావరి జలాలు విడుదల చేస్తుండడంతో రిజర్వాయర్లోని నీరు పెరుగుతోం ది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు 1225 క్యూసెక్కులు ఏలేరు జలాశయానికి విడుదలవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ప్రాజెక్టులో 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవ కాశం ఉంది. 77.45 మీటర్ల స్థాయిలో 10.66 టీ ఎంసీలు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపా రు. ఎడమ కాలువ నుంచి విశాఖపట్నంకి 300 క్యూసెక్కులు, ఏలేశ్వరంలోని తిమ్మరాజు చెరుకువుకు 600 క్యూసెక్కుల వంతులకు నీరు చేరుతోంది. దీంతో రైతులకు సాగు నీరు విడుదలవ్వడంతో రైతులకు పంటలపై భరోసా ఏర్పడింది.