నూకాంబిక ఆలయ అభివృద్ధికి విరాళం
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:05 AM
చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఆలమూరుకు చెందిన ఒక దాత రూ.1,00,116 విరాళం ఇచ్చారు.

ఆలమూరు, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఆలమూరుకు చెందిన ఒక దాత రూ.1,00,116 విరాళం ఇచ్చారు. అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం ఆలమూరుకు చెందిన సబ్బిశెట్టి తుకారామ్ కుమారులు నాగేశ్వరరావు, రాంబాబు, రాజా తదిత రులు గ్రామ పెద్దల సమక్షంలో విరాళం అందించగా, దాతలను గ్రామస్తులు అభినందించారు.