సినీ దర్శకుడు సుకుమార్ పరామర్శ
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:47 AM
ద్రాక్షారామ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మాతృవియోగంతో పొందిన పీఆ ర్ ప్రాజెక్టు డీఈఈ అన్యం రాంబాబును సినీ దర్శకుడు సుకుమార్ బుధవారం రాత్రి కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెలంపాలెంలో పరామర్శించారు. డీఈఈ మాతృమూర్తి సత్యవతి ఇటీవల వయోభారంతో మృతిచెందారు. దీంతో రాంబాబు
ద్రాక్షారామ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మాతృవియోగంతో పొందిన పీఆ ర్ ప్రాజెక్టు డీఈఈ అన్యం రాంబాబును సినీ దర్శకుడు సుకుమార్ బుధవారం రాత్రి కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెలంపాలెంలో పరామర్శించారు. డీఈఈ మాతృమూర్తి సత్యవతి ఇటీవల వయోభారంతో మృతిచెందారు. దీంతో రాంబాబు స్నేహితుడైన సుకుమార్ తన భార్య తబిత, అక్క లక్ష్మీ, బావ బ్రహ్మాజీలతో కలసి వెలంపాలెం చేరుకున్నారు. రాంబాబును ఓదార్చారు. సత్యవతి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అదేవిధంగా రాంబాబును బుధవారం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ పరామర్శించారు.