Share News

సత్యదేవుడి ఆదాయం రూ.1.69 కోట్లు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:40 AM

అన్నవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,69,06,902 నగదు, 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటు యూఎస్‌ ఏకు చెందిన 170 డాలర్లు, యు ఏఈ

సత్యదేవుడి ఆదాయం రూ.1.69 కోట్లు
భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది

అన్నవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,69,06,902 నగదు, 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటు యూఎస్‌ ఏకు చెందిన 170 డాలర్లు, యు ఏఈ 455 దిరహమ్స్‌, సింగపూర్‌ 5 డాలర్లు, ఇంగ్లాండ్‌ 25 పౌండ్స్‌, పలుదేశాల కరెన్సీని భక్తులు హుండీల్లో వేశారు. లెక్కింపును ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌ పర్యవేక్షించగా సిబ్బంది, సేవాసంస్థల సభ్యులు పాల్గొన్నారు. 32రోజులకు ఈ ఆదాయం సమకూరగా రోజుకు సరాసరిన రూ. 5.28 లక్షలు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు.

Updated Date - Sep 02 , 2025 | 12:40 AM