సత్యదేవుడి హుండీల ఆదాయం రూ 1.48 కోట్లు
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:20 AM
అన్నవరం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి హుండీలలో భక్తులు సమర్పించిన కానకులను సోమవారం లెక్కించగా రూ.1,48,77,775 నగదు, 62గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్ఏకు చెందిన 76 డాలర్లు, ఇంగ్లాండ్ 15 పౌండ్స్,
అన్నవరం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి హుండీలలో భక్తులు సమర్పించిన కానకులను సోమవారం లెక్కించగా రూ.1,48,77,775 నగదు, 62గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్ఏకు చెందిన 76 డాలర్లు, ఇంగ్లాండ్ 15 పౌండ్స్, యుఏఈ 20 దిరహమ్స్ లభించాయి. లెక్కింపును ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ పర్యవేక్షించగా దేవస్థానం సిబ్బంది, సేవాసంస్థల సభ్యులు లెక్కించారు. 35 రోజులకు ఈ ఆదాయం లభించగా సరాసరిన రోజుకు రూ.4.25 లక్షలు భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్నారు.