Share News

నేడు సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:01 AM

అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రత్నగిరివాసుడు సత్యదేవుడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తరద్వారాన్ని స ర్వాంగ సుందరంగా వివిధ సుగందభరిత పు ష్పాలతో అలంకరించారు. ప్రము

నేడు సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం
తీర్చిదిద్దిన సత్యదేవుడి ఉత్తరద్వార మార్గం

ఉదయం 5 నుంచి సాయంత్రం

5 గంటల వరకు దర్శనభాగ్యం

సర్వాంగ సుందరంగా ఆలయం

అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రత్నగిరివాసుడు సత్యదేవుడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తరద్వారాన్ని స ర్వాంగ సుందరంగా వివిధ సుగందభరిత పు ష్పాలతో అలంకరించారు. ప్రముఖులు, సామాన్యులకు ఏ ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వేకువజామున 4గంటలకు సుప్రభాతసేవ అనంతరం ము క్కోటి ఏకాదశి పూజలు, తర్వాత ఉదయం 5 గం టలకు ఉత్తరద్వార దర్శనానికి భక్తులను అను మతిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దర్శనం కొనసాగుతుంది. ప్రధానాలయం వద్ద ఏకకాలంలో మూలవరులతో పాటు ఉత్తరద్వారంలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తులను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు కదంబం ప్రసాదం వితరణ చేపట్టి 11గంటలకు కొండపై స్వామి, అమ్మవార్లకు వెండి రథ సేవ నిర్వహిస్తారు.

Updated Date - Dec 30 , 2025 | 01:01 AM