Share News

యానాంలో యానిమల్స్‌ షో

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:12 AM

యానాం, జూన్‌ 29 (ఆంధ్ర జ్యోతి): పుదుచ్చేరి రాష్ట్రంలో పాడిపశువుల రైతులను, పెంపుడు జంతువును పోషించే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మూగజీవాలతో వాటి యాజమానులకు పోటీలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా యానాం పశుగాణాభివృద్ధి, పశుసంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం

యానాంలో యానిమల్స్‌ షో
విన్యాసాలతో ఆకట్టుకున్న మేలు జాతికుక్కలు

యానాం, జూన్‌ 29 (ఆంధ్ర జ్యోతి): పుదుచ్చేరి రాష్ట్రంలో పాడిపశువుల రైతులను, పెంపుడు జంతువును పోషించే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మూగజీవాలతో వాటి యాజమానులకు పోటీలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా యానాం పశుగాణాభివృద్ధి, పశుసంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన పశువులు, కోళ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. పశువైద్యాధికారి డాక్టర్‌ కె.ఎ.కుమార్‌ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవ రణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. యానాంలోని ఇళ్లల్లో పెం చుకునే వివిధ జాతుల కుక్కలు, పిల్లులు, పాడిగేదేలు, పుంగనూరు, దేశవాళీమేరు జాతి ఆవులను ప్రదర్శనలో ఉంచారు. ప్రముఖ చమురు సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీలో ఉండే మేలు జాతి కుక్కలతో వాటి సంర క్షులు చేయించిన విన్యాసాలు ఎంతో ఆకర్షించాయి. ప్రదర్శనలో ప్రతిభ సాధించినవారికి అధికారు లు బహుమతులను అందజేశారు.

Updated Date - Jun 30 , 2025 | 12:12 AM