ఆ అధికారులపై చర్యలేవి?
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:18 AM
వైసీపీ పాలనలో రంపచోడవ రం ఐటీడీఏ ఉన్నతాధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారు. అప్పటి ప్రభుత్వ అధినేత మన్ననల కోసం ప్రాకులాడి, నిబంధనలకు తిలో దకాలిచ్చారు. ఫలితంగా గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం వెచ్చించా ల్సిన నిధులను ఐటీడీఏ పాలక మండలి ఆమోదాలు లేకుండానే చట్ట విరుద్ధ అంశాలకు సైతం వెచ్చించారు. స్కానింగ్ యంత్రాల ను వినియోగించేందుకు చట్టపరమైన ఎటు వంటి అనుమతులు, వా
వైసీపీ పాలనలో నిధుల దుర్వినియోగం
రంప ఐటీడీఏలో ఆరోగ్య కేంద్రాలకు
రూ.62 లక్షలతో స్కానింగ్ యంత్రాల కొనుగోళ్లు
గిరిజనులకు ఉపయోగం లేని
పార్కు నిర్మాణం కోసం రూ.20 లక్షలు
(రంపచోడవరం/ఆంధ్రజ్యోతి)
వైసీపీ పాలనలో రంపచోడవ రం ఐటీడీఏ ఉన్నతాధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారు. అప్పటి ప్రభుత్వ అధినేత మన్ననల కోసం ప్రాకులాడి, నిబంధనలకు తిలో దకాలిచ్చారు. ఫలితంగా గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం వెచ్చించా ల్సిన నిధులను ఐటీడీఏ పాలక మండలి ఆమోదాలు లేకుండానే చట్ట విరుద్ధ అంశాలకు సైతం వెచ్చించారు. స్కానింగ్ యంత్రాల ను వినియోగించేందుకు చట్టపరమైన ఎటు వంటి అనుమతులు, వాటి నిర్వహణకు అనుభ వజ్ఞులైన నిర్వహకులు లేకున్నా వాటిని కొను గోలు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్ప డటమే కాకుండా ప్రభుత్వ ఖజానాకూ నష్టం చేకూర్చిన అధికారి ఒక రైతే, రూ.20 లక్షల ఉపాధి నిధులను నిరుపయోగమైన పార్కు నిర్మాణానికి వెచ్చించిన వారు మరొకరు. కొను గోలు చేసిన యంత్రాలను వినియోగించే అవ కాశమే లేక నేడు నిరుపయోగంగా ఉన్నాయి.
ఎవరైనా స్కానింగ్ యంత్రాలను నిర్వహిం చాలనుకుంటే అది ఆసుపత్రి అయినా, లేక స్కానింగ్ సెంటరైనా చట్టప్రకారం అనుమతు లుండాలి. కానీ రంపచోడవరం ఐటీడీఏ పరిధి లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు అటువంటి అను మతులు ఉన్న దాఖలాలు లేవు. చట్ట విరుద్ధం గానైనా ఆయా స్కానింగ్ యంత్రాలను నిర్వహించే అనుభవము, అనుమతీ ఉన్న వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేకుండానే వాడ పల్లి, జడ్డంగి, బోదులూరు, ఇందుకూరుపేట, దుప్పుల పాలెం, నరసాపురం, పెదగెద్దాడ, చవ టిదిబ్బలు, దేవీపట్నం, కొండమొదలు ఆరోగ్య కేంద్రాలకు రూ.62.69 లక్షలతో ఆలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలను 2022, ఫిబ్రవరిలో కొనుగోలు చేశారు. రూ.37 లక్షలతో పీహెచ్సీల అంబులెన్సులు, 108 అంబులెన్సుల కోసం వైర్లెస్ డిజిటల్ రిపీటర్లు, డిజిటల్ బేస్ స్టేషన్లు, మొబైల్ సెట్లను కొనుగోలు చేశారు. రెండో విడత కొవిడ్ పేరుతో రూ.59.21 లక్షలతో అంబు బ్యాగ్లు, పల్స్ ఆక్సీ మీటర్లను, రూ.12.10 లక్షలతో 64 లీటర్ల సామర్థ్యం గల 15 ఆక్సిజెన్ సిలెండ ర్లను మే, 2021లో కొనుగోలు చేశారు.
మరో అధికారి కూడా రంపచోడవరంలో ఒక పార్కు నిర్మాణాకికి రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులను దుర్వినియోగపర్చారు. ఉపాధి హామీపై జరిగిన ఆడిట్లో ఇది తప్పుగా అనిపి ంచలేదు. ఈ ఇద్దరి అధికారుల నిర్ణయాలు వివాదస్పదంగానే రంపచోడ వరం ఐటీడీఏలో సాగాయి. పాలకమండలి ఆమోదం లేకుండానే గిరిజన నిధులను దుర్విని యోగపర్చినా వారిపై ఏ చర్యలూ లేవు. ప్రభుత్వం మారి 9 నెలలు గడిచినా నిధుల దుర్వినియోగ నిర్ణయా లపై చర్యలు లేకపోవడంపై సర్వత్రా గిరిజన వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.