Aerospace: ప్రభుత్వ సలహాదారుగా సతీశ్రెడ్డి బాధ్యతలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:42 AM
డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక వనరులను రాష్ట్రంలో అందుబాటులో ఉంచే ప్రణాళికలు చెప్పారు.
రాష్ట్రానికి డిఫెన్స్, ఏరో స్పేస్ పరిశ్రమలు రావాలి: ఎంపీ కేశినేని చిన్ని
అమరావతి, మంగళగిరి సిటీ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు రాష్ట్ర ప్రభు త్వ సలహాదారుడిగా నియమితులైన డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ.సతీశ్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్ పాల్గొని సతీశ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చాం. వీటితోపాటు డిఫెన్స్, ఏరో స్పేస్ పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరముంది. సతీశ్రెడ్డి అనుభవాన్ని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అని ఎంపీ చిన్నీ అన్నారు. సతీశ్రెడ్డి మాట్లాడుతూ... ‘నాకు ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో వున్న అనుభవంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులతో చర్చించి కృషి చేస్తాను. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో హైదరాబాద్ వెళ్లే మార్గంలోను, అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయి’ అని అన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..