కంపచెట్లు తొలగించరూ..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:23 PM
మండలంలోని తిప్పేపల్లి నుంచి రావుల చెరువు గ్రామానికి వెళ్లే రహదారికి ఇరుపక్కలా భారీగా కంపచెట్లు పెరిగాయి.

ధర్మవరంరూరల్ జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పేపల్లి నుంచి రావుల చెరువు గ్రామానికి వెళ్లే రహదారికి ఇరుపక్కలా భారీగా కంపచెట్లు పెరిగాయి. కంపచెట్లు పెరిగిపోవడంతో ద్విచక్ర వాహన దారులకు కంపలు గీసుకుని గాయాల పాలవుతున్నారు. రాత్రి వేళల్లో మరీ ఇబ్బందిగా ఉంటోందని గ్రామీణులు వాపోతున్నారు. అధికారులు ఆ కంపచెట్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.