తోపుదుర్తి చందుపై ఫిర్యాదు
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:47 PM
టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్న తోపుదుర్తి చందు గతంలో అసభ్య పదజాలంతో తిట్టారని టీడీపీ నాయకులు అన్నారు.

బత్తలపల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్న తోపుదుర్తి చందు గతంలో అసభ్య పదజాలంతో తిట్టారని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ స్టేషనలో ఎస్ఐ సోమశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఆ నాయకులు మాట్లాడుతూ.. 2022 నవంబరులో రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో చంద్రబాబు, నారా లోకేష్ను చంద్రు తీవ్ర పదజాలంతో దూషించాలని, ఆ వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని అన్నారు. తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా నాయకులు గంటాపురం జగ్గు, నారాయణరెడ్డి, సంగాలసూరి, సురేంద్ర పాల్గొన్నారు.