Share News

విజయోత్సవ ర్యాలీ

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:39 AM

అరాచక పాలన అంతమై.. సుపరిపాలన మొదలై.. ఏడాది అయిందంటూ గూడూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు.

విజయోత్సవ ర్యాలీ
ఆస్పత్రి రోడ్డులో సాగుతున్న ర్యాలీ

అరాచక పాలన అంతమై.. సుపరిపాలన మొదలై.. ఏడాది అయిందంటూ గూడూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ పొడవునా పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఇక, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు కేకుల్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీకాళహస్తి, తిరుమల తదితర ఆలయాల వద్ద టెంకాయలు కొట్టారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడే సీఎం చంద్రబాబుకు భగవంతుడి ఆశీర్వాదాలు అందాలని మొక్కుకున్నారు. ఇంకొన్ని చోట్ల మొక్కలు నాటారు.

- గూడూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 13 , 2025 | 01:39 AM