వాహనాల బారులు
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:33 AM
అలిపిరిలోని భద్రతా తనిఖీల కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసిపోయింది. తనిఖీ కేంద్రం నుంచి గరుత్మంతుడి విగ్రహం ముందున్న ఆర్చ్ వరకు వాహనాలు బారులుతీరాయి.
వాహనాల బారులు
అలిపిరిలోని భద్రతా తనిఖీల కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసిపోయింది. తనిఖీ కేంద్రం నుంచి గరుత్మంతుడి విగ్రహం ముందున్న ఆర్చ్ వరకు వాహనాలు బారులుతీరాయి. శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో వాహనాలను తనిఖీ చేసే అలిపిరి వద్ద వాహనాల సంఖ్య పెరిగిపోయిన క్రమంలో భద్రతా సిబ్బంది వేగవంతంగా తనిఖీ చేసి తిరుమలకు పంపారు. సాయంత్రం తర్వాత చెక్పాయింట్ వద్ద సాధారణస్థితి నెలకొంది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి