Share News

వ్యవసాయ అనుబంధ శాఖల్లో బదిలీలు

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:58 AM

జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల్లో పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎం.సౌభాగ్యలక్ష్మిని తిరుపతి జిల్లా ట్రైనింగ్‌ సెంటర్‌కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో ఏడీఏగా పనిచేస్తున్న జి.వాసును చిత్తూరు జిల్లా వ్యవసాయ ట్రైనింగ్‌ సెంటర్‌కు, పలమనేరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డి.అన్నపూర్ణను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌కు బదిలీ చేశారు. ఉద్యాన శాఖలో ప్రకాశం జిల్లా ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న పీవీ రమణను చిత్తూరు జిల్లా ఏపీఎంఐపీ పీడీగా బదిలీ చేశారు. ఇక్కడ ఏపీఎంఐపీ పీడీగా పనిచేస్తున్న ఎస్‌ఏ బాలసుబ్రమణ్యంను శ్రీశైలం ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీకి బదిలీ చేశారు. జిల్లా పట్టుపరిశ్రమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శోభరాణిని పరిపాలన సౌలభ్యం కింద శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పట్టుపరిశ్రమ అధికారిగా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న డి.పద్మమ్మ జేడీగా చిత్తూరు పట్టు పరిశ్రమ శాఖకు రానున్నారు.

వ్యవసాయ అనుబంధ శాఖల్లో బదిలీలు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల్లో పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎం.సౌభాగ్యలక్ష్మిని తిరుపతి జిల్లా ట్రైనింగ్‌ సెంటర్‌కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో ఏడీఏగా పనిచేస్తున్న జి.వాసును చిత్తూరు జిల్లా వ్యవసాయ ట్రైనింగ్‌ సెంటర్‌కు, పలమనేరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డి.అన్నపూర్ణను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌కు బదిలీ చేశారు. ఉద్యాన శాఖలో ప్రకాశం జిల్లా ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న పీవీ రమణను చిత్తూరు జిల్లా ఏపీఎంఐపీ పీడీగా బదిలీ చేశారు. ఇక్కడ ఏపీఎంఐపీ పీడీగా పనిచేస్తున్న ఎస్‌ఏ బాలసుబ్రమణ్యంను శ్రీశైలం ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీకి బదిలీ చేశారు. జిల్లా పట్టుపరిశ్రమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శోభరాణిని పరిపాలన సౌలభ్యం కింద శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పట్టుపరిశ్రమ అధికారిగా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న డి.పద్మమ్మ జేడీగా చిత్తూరు పట్టు పరిశ్రమ శాఖకు రానున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:58 AM