రద్దీగా తిరుపతి రైల్వే స్టేషన్
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:31 AM
తిరుమలకు వచ్చే భక్తులు.. వేసవి రద్దీ కలిపి తిరుపతి రైల్వే స్టేషన్ ప్రాంగణం, సాధారణ విశ్రాంతి హాలులో ప్రయాణికుల సందడి ఎక్కువైంది.

తిరుమలకు వచ్చే భక్తులు.. వేసవి రద్దీ కలిపి తిరుపతి రైల్వే స్టేషన్ ప్రాంగణం, సాధారణ విశ్రాంతి హాలులో ప్రయాణికుల సందడి ఎక్కువైంది. రోజువారీగా తిరుపతి మీదుగా 90 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక, తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా తిరుపతి మీదుగా నెలకు 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా రద్దీ తగ్గడంలేదు. అన్ని రైళ్లలో సామర్థ్యం కంటే మించి.. వెయిటింగ్ లిస్ట్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అదనపు కోచ్లు ఏర్పాటు చేస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి.
- తిరుపతి(సెంట్రల్), ఆంధ్రజ్యోతి