రైతు కడుపుమండింది
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:31 AM
అప్పు చేసి రాత్రీపగలు కష్టపడి పండించిన పంటకు చివరకు కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదనే బాధతో కొంతమంది రైతులు టమోటాలను మార్కెట్కు తీసుకెళ్లకుండా పొలాల పక్కనే పడేశారు. పుంగనూరు- చిత్తూరు మార్గంలోని గూడూరుపల్లె సమీపంలో రోడ్డుపక్క టమోటాలను రైతులు ఇలా పడేశారు.
అప్పు చేసి రాత్రీపగలు కష్టపడి పండించిన పంటకు చివరకు కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదనే బాధతో కొంతమంది రైతులు టమోటాలను మార్కెట్కు తీసుకెళ్లకుండా పొలాల పక్కనే పడేశారు. పుంగనూరు- చిత్తూరు మార్గంలోని గూడూరుపల్లె సమీపంలో రోడ్డుపక్క టమోటాలను రైతులు ఇలా పడేశారు. ఎకరం టమోటా సాగుచేయాలంటే దాదాపు రూ.3 లక్షలకు పైగా వ్యయం అవుతోంది. అయితే ఈ సీజన్లో టమోటాకు గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోయారు.చివరకు టమోటా కోత ఖర్చులు కూడా రావడం లేదన్న బాధతో మార్కెట్కు తీసుకెళ్లకుండా ఇలా నేలపాలు చేశారు. బుధవారం పుంగనూరు మార్కెట్లో మొదటి రకం టమోటా కిలో రూ.19.40, రెండో రకం రూ.18, మూడో రకం రూ.16.70 పలికింది.
-పుంగనూరు రూరల్, ఆంధ్రజ్యోతి