పింఛన్ల పంపిణీలో జిల్లాకు రెండో స్థానం
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:58 AM
న్టీఆర్ భరోసా సామాజిక భధ్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు రెండవ స్థానం దక్కింది. 2,60,379మందికిగాను శనివారం రాత్రి 7గంటలకు 2,45,837మందికి పింఛన్ల కింద రూ.105.22 కోట్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, ఏపీడీ ప్రభావతి చెప్పారు.
2,45,837మందికి పంపిణీ
తిరుపతి(కలెక్టరేట్), మే 31(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక భధ్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు రెండవ స్థానం దక్కింది. 2,60,379మందికిగాను శనివారం రాత్రి 7గంటలకు 2,45,837మందికి పింఛన్ల కింద రూ.105.22 కోట్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, ఏపీడీ ప్రభావతి చెప్పారు. జిల్లాలో ఉదయం 6.30గంటలకే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధికారులకు పింఛన్లు అందించారు. సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు. జూన్ 1 ఆదివారంకావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించారు. తిరుపతి నగరంలో టీడీపీ నేతలు నరసింహయాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్వర్మ తదితరులతో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.