Share News

8 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - May 07 , 2025 | 12:54 AM

ఎనిమిది మండలాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తవణంపల్లెలో 42.4, నగరిలో 41.9, చిత్తూరు, గుడిపాల మండలాల్లో 41.5, శ్రీరంగరాజపురంలో 40.9, పూతలపట్టు, పులిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో 39.5, బంగారుపాళ్యం, గంగాధరనెల్లూరు మండలాల్లో 39.1, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, ఐరాల, నిండ్ర, విజయపురం, యాదమరి, పాలసముద్రం, పెనుమూరు మండలాల్లో 38.8, కార్వేటినగరంలో 38.3, రొంపిచెర్లలో 38.1, సోమలలో 38.0, పలమనేరులో 37.9, సదుంలో 37.6, గుడుపల్లె, కుప్పం, శాంతిపురం, వి.కోట మండలాల్లో 36.4, పుంగనూరులో 36.3, రామకుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

8 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ఎనిమిది మండలాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తవణంపల్లెలో 42.4, నగరిలో 41.9, చిత్తూరు, గుడిపాల మండలాల్లో 41.5, శ్రీరంగరాజపురంలో 40.9, పూతలపట్టు, పులిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో 39.5, బంగారుపాళ్యం, గంగాధరనెల్లూరు మండలాల్లో 39.1, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, ఐరాల, నిండ్ర, విజయపురం, యాదమరి, పాలసముద్రం, పెనుమూరు మండలాల్లో 38.8, కార్వేటినగరంలో 38.3, రొంపిచెర్లలో 38.1, సోమలలో 38.0, పలమనేరులో 37.9, సదుంలో 37.6, గుడుపల్లె, కుప్పం, శాంతిపురం, వి.కోట మండలాల్లో 36.4, పుంగనూరులో 36.3, రామకుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఫ పలు మండలాల్లో వర్షం

గడిచిన 24గంటల్లో పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పులిచెర్లలో 35, కుప్పంలో 19.2, గుడుపల్లెలో 18.6 మిమీ వర్షం కురిసింది.బంగారుపాళ్యం మండలంలో గాలి బీభత్సానికి ఐదు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.విద్యుత్‌ సరఫరాకు కొంత అంతరాయం ఏర్పడింది.వెదురుకుప్పం మండలంలో మంగళవారం సాయంత్రం మోస్తరు వానతో వాతావరణం చల్లబడింది.ఎస్‌ఆర్‌పురం మండలంలో మంగళవారం సాయంత్రం గాలివాన కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరి మండల పరిధిలో మంగళవారం సాయంత్రం పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది.విద్యుత్‌ అంతరాయంతో గాడాంధకారం నెలకొంది.

Updated Date - May 07 , 2025 | 12:54 AM