6 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - May 12 , 2025 | 01:36 AM
జిల్లాలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం ఆరు మండలాల్లో 40 డిగ్రీలకుపైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం ఆరు మండలాల్లో 40 డిగ్రీలకుపైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా.. అత్యధికంగా పూతలపట్టు, చిత్తూరు, తవణంపల్లెలో 41.6, నిండ్ర, నగరి, విజయపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పెనుమూరు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పంలో 39.7, గుడుపల్లె, యాదమరిలో 38.3, బంగారుపాళ్యంలో 37.9, గంగాధరనెల్లూరులో 37.6, పుంగనూరు, చౌడేపల్లె, గుడుపల్లె, ఐరాల, పాలసముద్రంలో 37.5, కార్వేటినగరంలో 37.1, సదుంలో 36.4, శాంతిపురంలో 35.6, గంగవరం, పెద్దపంజాణిలో 35.4, సోమలలో 35.1, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలో 35, బైరెడ్డిపల్లె, పలమనేరు, వి.కోటలో 34.5, కుప్పంలో 33.2, రామకుప్పంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.