ప్రతిభకు పురస్కారాలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:59 AM
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అధికారులు, ఉద్యోగులకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉత్తమ పురస్కారాలు అందజేశారు. గురువారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరచిన జిల్లా గ్రామ పంచాయతీ అధికారిణి సుశీలాదేవి.. పల్లెపండుగ అమలులో ప్రతిభ కనబరచిన డీపీఆర్ఈవో (పంచాయతీరాజ్ ఎస్ఈ) రామ్మోహన్.. ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవలు అందించిన ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు పురస్కారాలు అందుకున్నారు. వీరిని కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు.
తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అధికారులు, ఉద్యోగులకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉత్తమ పురస్కారాలు అందజేశారు. గురువారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరచిన జిల్లా గ్రామ పంచాయతీ అధికారిణి సుశీలాదేవి.. పల్లెపండుగ అమలులో ప్రతిభ కనబరచిన డీపీఆర్ఈవో (పంచాయతీరాజ్ ఎస్ఈ) రామ్మోహన్.. ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవలు అందించిన ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు పురస్కారాలు అందుకున్నారు. వీరిని కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు.