వీధిలైట్లు ఆపి నిరసన
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:25 AM
చిత్తూరు నగరపాలకసంస్థలో ఔట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న కార్మికులు నగరంలో విద్యుత్ సరఫరాను ఆపివేసి నిరసన వ్యక్తం చేశారు.
చిత్తూరు అర్బన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరపాలకసంస్థలో ఔట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న కార్మికులు నగరంలో విద్యుత్ సరఫరాను ఆపివేసి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వారం రోజులుగా చిత్తూరు నగరపాలక కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం సాయంత్రం చిత్తూరు నగరంలోని వీధి లైట్లను ఆపివేశారు.దీంతో వీధుల్లో అంధకారం నెలకొని జనం ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం నుంచి నీటిసరఫరాను కూడా ఆపివేస్తామని కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి హెచ్చరించారు.