Share News

నత్తనడకే..!

ABN , Publish Date - May 10 , 2025 | 12:35 AM

అధికారంలో వున్న పార్టీ పదవులకు సహజంగా మంచి హోదా, గౌరవం దక్కుతుంది.ప్రస్తుతం అధికారంలో వుండడంతో టీడీపీలో పదవుల కోసం పోటీ ఎక్కువగానే వుంది.అయితే జిల్లాలో పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఈ నెల 18వ తేదీలోగా గ్రామ, మండల స్థాయి సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని టీడీపీ అధిష్ఠానం నుంచి ఆదేశాలున్నా ఒకట్రెండు నియోజకవర్గాల్లోనే గ్రామ కమిటీల నియామక ప్రక్రియ జరుగుతోంది. కొన్నిచోట్ల అసలు ప్రారంభమే కాలేదు. మండల కమిటీ ఎన్నికలైతే ఎక్కడా ప్రారంభం కాలేదు.

నత్తనడకే..!

- టీడీపీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించని ఎమ్మెల్యేలు

చిత్తూరు, మే 9 (ఆంధ్రజ్యోతి) : అధికారంలో వున్న పార్టీ పదవులకు సహజంగా మంచి హోదా, గౌరవం దక్కుతుంది.ప్రస్తుతం అధికారంలో వుండడంతో టీడీపీలో పదవుల కోసం పోటీ ఎక్కువగానే వుంది.అయితే జిల్లాలో పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఈ నెల 18వ తేదీలోగా గ్రామ, మండల స్థాయి సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని టీడీపీ అధిష్ఠానం నుంచి ఆదేశాలున్నా ఒకట్రెండు నియోజకవర్గాల్లోనే గ్రామ కమిటీల నియామక ప్రక్రియ జరుగుతోంది. కొన్నిచోట్ల అసలు ప్రారంభమే కాలేదు. మండల కమిటీ ఎన్నికలైతే ఎక్కడా ప్రారంభం కాలేదు.

ఫ పార్టీ ఆదేశాలు పట్టని వైనం

ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ వార్షిక పండుగ మహానాడు జరగనుంది. అక్కడ పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అందుకే ఈ నెల 18లోగా జిల్లాలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని పార్టీ ఆదేశించింది. ఇటీవల చిత్తూరులో పర్యటించిన ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి కూడా ఎన్నికల్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ఫ గతంలో నిర్మాణాత్మకంగా ఎన్నికలు

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మండలాల్లో ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాయిదా కూడా వేయాల్సి వచ్చింది. ఓ మండలంలో సంస్థాగత ఎన్నికల్ని మరో మండలానికి చెందిన నాయకులు పరిశీలకులుగా వచ్చి నిర్వహించేవారు.గ్రామ సభలు నిర్వహించి, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ఎన్నుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎవర్ని ఎంపిక చేస్తే వారే కమిటీలో చోటు దక్కించుకుంటున్నారు. దీంతో ఒక్కోసారి ఎన్నికల్లో కష్టపడి పనిచేసినవారికి అన్యాయం జరిగే అవకాశాలున్నాయని శ్రేణులు వాపోతున్నాయి.ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. ఆయన నియమించుకున్న మండల, గ్రామ కమిటీ నాయకులంతా వెళ్లిపోయిన సందర్భాలు కూడా వున్నాయి.

జిల్లా అధ్యక్షుడి పాత్ర ఎంత..?

చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదనే ఆరోపణలు ఓ వైపుండగా మరో వైపు ఆయన పార్టీని నడిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా వున్నాయి. ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రాలేదు. వాస్తవానికి ఈ సంస్థాగత ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడి పాత్ర కీలకం అయినప్పటికీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.

ఆ రెండు నియోజకవర్గాల్లో

పోటీ ఎక్కువ

జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో మండల అధ్యక్ష పదవులకు విపరీతమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. కుప్పం నియోజకవర్గంలో పోటీ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్‌ కానుంది.

Updated Date - May 10 , 2025 | 12:35 AM