పంచాయతీలకు రూ.1.38 కోట్లు విడుదల
ABN , Publish Date - May 10 , 2025 | 12:33 AM
గత ఐదేళ్ళ కాలంలో గ్రామ పరిపాలన నిధుల్లేక చతికిలపడింది.ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చొరవతో గ్రామపంచాయతీలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల వుతున్నాయి. స్టేట్ గ్రాంట్గా తొలి త్రైమాసికానికి జిల్లాకు రూ.1,38,35,646 నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్లకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ.3వేల చొప్పున మూడునెలలకు గాను రూ.9వేల వంతున రూ.86,95,992 నిధులు విడుదలయ్యాయి. తలసరి ఆదాయం (పర్ కేపిటా గ్రాంట్) రూపంలో రూ.15,05,785 గ్రాంట్ వచ్చింది. వృత్తి పన్ను రూపంలో రూ.36,33,196, గ్రంథాలయ సంస్థ గ్రాంట్గా రూ.673 వెరసి రూ.1.38 కోట్లు జిల్లాకు విడుదలయ్యింది. ఈ మొత్తాలను వచ్చే వారం సర్పంచ్లకు, గ్రామపంచాయతీల ఖాతాలకు విడుదల చేస్తారని డీపీవో సుధాకర రావు తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్, మే 9 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ళ కాలంలో గ్రామ పరిపాలన నిధుల్లేక చతికిలపడింది.ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చొరవతో గ్రామపంచాయతీలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల వుతున్నాయి. స్టేట్ గ్రాంట్గా తొలి త్రైమాసికానికి జిల్లాకు రూ.1,38,35,646 నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్లకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ.3వేల చొప్పున మూడునెలలకు గాను రూ.9వేల వంతున రూ.86,95,992 నిధులు విడుదలయ్యాయి. తలసరి ఆదాయం (పర్ కేపిటా గ్రాంట్) రూపంలో రూ.15,05,785 గ్రాంట్ వచ్చింది. వృత్తి పన్ను రూపంలో రూ.36,33,196, గ్రంథాలయ సంస్థ గ్రాంట్గా రూ.673 వెరసి రూ.1.38 కోట్లు జిల్లాకు విడుదలయ్యింది. ఈ మొత్తాలను వచ్చే వారం సర్పంచ్లకు, గ్రామపంచాయతీల ఖాతాలకు విడుదల చేస్తారని డీపీవో సుధాకర రావు తెలిపారు.