చిత్తూరు అభివృద్ధికి వేగంగా అడుగులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:41 AM
చిత్తూరు నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైరోడ్డును విస్తరించే క్రమంలో మున్సిపల్ అధికారులు విడతల వారీగా ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. తాజాగా గాంధీ రోడ్డు అభివృద్ధి కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ పనుల్ని కలెక్టర్ సుమిత్కుమార్ పరిశీలించారు. ఈ రోడ్డులోని విద్యుత్తు స్తంభాలను, ఆక్రమణలను కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏసీపీ నాగేంద్ర తొలగింపజేశారు.ఇటీవల కట్టమంచి బైపాస్ పనులకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్ శంకుస్థాపన చేయగా, 3 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిత్తూరుతో పాటు కుప్పంలోనూ కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చిత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైరోడ్డును విస్తరించే క్రమంలో మున్సిపల్ అధికారులు విడతల వారీగా ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. తాజాగా గాంధీ రోడ్డు అభివృద్ధి కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ పనుల్ని కలెక్టర్ సుమిత్కుమార్ పరిశీలించారు. ఈ రోడ్డులోని విద్యుత్తు స్తంభాలను, ఆక్రమణలను కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏసీపీ నాగేంద్ర తొలగింపజేశారు.ఇటీవల కట్టమంచి బైపాస్ పనులకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్ శంకుస్థాపన చేయగా, 3 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిత్తూరుతో పాటు కుప్పంలోనూ కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.