Share News

28మండలాల్లో వర్షం

ABN , Publish Date - May 10 , 2025 | 12:31 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రమయ్యే సరికి వర్షపు జల్లులతో ఆహ్లాద వాతావరణం నెలకొంటోంది. జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 28 మండలాల్లో తేలికపాటి నుండి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా నిండ్రలో 41.4, అత్యల్పంగా బైరెడ్డిపల్లెలో 0.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది.పెద్దపంజాణిలో 30.4, కార్వేటినగరంలో 17.4, ఐరాలలో 13, నగరి, వెదురుకుప్పం మండలాల్లో 12.6, రొంపిచెర్లలో 12.4, పెనుమూరులో 11.8, చౌడేపల్లెలో 10, యాదమరిలో 9.6, రామకుప్పంలో 8.2, చిత్తూరు, శాంతిపురం మండలాల్లో 7.6, సోమలలో 6.8, గంగవరంలో 5.8, బంగారుపాళ్యంలో 5.6, కుప్పంలో 5.4, తవణంపల్లెలో 3.4, గుడుపల్లె, విజయపురం మండలాల్లో 3.2, గుడిపాలలో 3, పులిచెర్లలో 2.4, పుంగనూరులో 2.2, సదుంలో 2, పలమనేరులో 1.8, పాలసముద్రంలో 1.2, వి.కోటలో ఒక మిమీ వర్షపాతం నమోదైంది.మేనెల సాధారణ వర్షపాతం 4.5 మిమీ కాగా, శుక్రవారం వరకు 45 మిమీ వర్షపాతం నమోదయ్యింది. 20శాతం కంటే మించి 17 మండలాల్లో, 20 శాతం లోపు 14 మండలాల్లో వర్షం కురిసింది.కాగా శుక్రవారం అత్యధికంగా వెదురుకుప్పంలో 41.3, అత్యల్పంగా రామకుప్పంలో 33.0 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తవణంపల్లెలో 40.6, నగరిలో 40.5, శ్రీరంగరాజపురంలో 38.1, గుడిపాలలో 37.5, చిత్తూరులో 37.2, బంగారుపాళ్యంలో 36.9, గంగాధరనెల్లూరులో 36.5, పులిచెర్ల, పూతలపట్టు మండలాల్లో 36.1, చౌడేపల్లె, విజయపురం, పాలసముద్రం, యాదమరి, ఐరాల, నిండ్ర, పెనుమూరు మండలాల్లో 35.9, కార్వేటినగరంలో 35.8, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో 35.2, సదుం, సోమల మండలాల్లో 35.1, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లో 35, రొంపిచెర్లలో 34.3, పలమనేరులో 34, వి.కోట, పుంగనూరు మండలాల్లో 33.5, బైరెడ్డిపల్లెలో 33.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

28మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రమయ్యే సరికి వర్షపు జల్లులతో ఆహ్లాద వాతావరణం నెలకొంటోంది. జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 28 మండలాల్లో తేలికపాటి నుండి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా నిండ్రలో 41.4, అత్యల్పంగా బైరెడ్డిపల్లెలో 0.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది.పెద్దపంజాణిలో 30.4, కార్వేటినగరంలో 17.4, ఐరాలలో 13, నగరి, వెదురుకుప్పం మండలాల్లో 12.6, రొంపిచెర్లలో 12.4, పెనుమూరులో 11.8, చౌడేపల్లెలో 10, యాదమరిలో 9.6, రామకుప్పంలో 8.2, చిత్తూరు, శాంతిపురం మండలాల్లో 7.6, సోమలలో 6.8, గంగవరంలో 5.8, బంగారుపాళ్యంలో 5.6, కుప్పంలో 5.4, తవణంపల్లెలో 3.4, గుడుపల్లె, విజయపురం మండలాల్లో 3.2, గుడిపాలలో 3, పులిచెర్లలో 2.4, పుంగనూరులో 2.2, సదుంలో 2, పలమనేరులో 1.8, పాలసముద్రంలో 1.2, వి.కోటలో ఒక మిమీ వర్షపాతం నమోదైంది.మేనెల సాధారణ వర్షపాతం 4.5 మిమీ కాగా, శుక్రవారం వరకు 45 మిమీ వర్షపాతం నమోదయ్యింది. 20శాతం కంటే మించి 17 మండలాల్లో, 20 శాతం లోపు 14 మండలాల్లో వర్షం కురిసింది.కాగా శుక్రవారం అత్యధికంగా వెదురుకుప్పంలో 41.3, అత్యల్పంగా రామకుప్పంలో 33.0 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తవణంపల్లెలో 40.6, నగరిలో 40.5, శ్రీరంగరాజపురంలో 38.1, గుడిపాలలో 37.5, చిత్తూరులో 37.2, బంగారుపాళ్యంలో 36.9, గంగాధరనెల్లూరులో 36.5, పులిచెర్ల, పూతలపట్టు మండలాల్లో 36.1, చౌడేపల్లె, విజయపురం, పాలసముద్రం, యాదమరి, ఐరాల, నిండ్ర, పెనుమూరు మండలాల్లో 35.9, కార్వేటినగరంలో 35.8, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో 35.2, సదుం, సోమల మండలాల్లో 35.1, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లో 35, రొంపిచెర్లలో 34.3, పలమనేరులో 34, వి.కోట, పుంగనూరు మండలాల్లో 33.5, బైరెడ్డిపల్లెలో 33.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 10 , 2025 | 12:31 AM