పోలెండ్ అమ్మాయి.. శేషాపురం అబ్బాయి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:57 PM
చంద్రగిరి మండలానికి చెందిన యువకుడు, పోలెండ్ దేశానికి చెందిన ఓ అమ్మాయి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒక్కటయ్యారు
చంద్రగిరి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రేమకు ఎల్లలు ఉండవని నిరూపించారు చంద్రగిరి మండలానికి చెందిన యువకుడు, పోలెండ్ దేశానికి చెందిన ఓ అమ్మాయి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒక్కటయ్యారు. చంద్రగిరి మండలం శేషాపురం గ్రామానికి చెందిన కనుమూరి మురళీధర్ నాయుడు, దేవకి దంపతుల కుమారుడు దేవ శివసాయి మురారీ జర్మనీలోని ఓ మెడికల్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న పోలెండ్ దేశానికి చెందిన యావ్గోర్జాత్ని ప్రేమించాడు. తమ ప్రేమ విషయాన్ని వీరిద్దరూ తల్లిదండ్రులకు వివరించారు. వారు సరే అన్నారు. కాశిపెంట్ల వద్ద ఏజేపీ రిసార్ట్స్లో శనివారం రాత్రి వీరి వివాహం జరిగింది.