కలెక్టరేట్లో నేడు ‘పీజీఆర్ఎస్’
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:03 AM
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి విజ్ఞప్తులను తీసుకుంటారని తెలిపారు. డివిజన్, మండలస్థాయిల్లోనూ పీజీఆర్ఎస్ నిర్వహించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోనూ సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందని ఎస్పీ మణికంఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాఽధిత ప్రజలు హాజరై సమస్యలను విన్నవించుకోవాలని కోరారు.
చిత్తూరు అర్బన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి విజ్ఞప్తులను తీసుకుంటారని తెలిపారు. డివిజన్, మండలస్థాయిల్లోనూ పీజీఆర్ఎస్ నిర్వహించాలని సూచించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోనూ సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందని ఎస్పీ మణికంఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాఽధిత ప్రజలు హాజరై సమస్యలను విన్నవించుకోవాలని కోరారు.