కొనసాగుతున్న కలెక్టర్ తనిఖీలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:52 AM
గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్అండ్ఇన్స్, సీకే పల్లె వద్ద వున్న తాసా జ్యూస్ ఫ్యాక్టరీలను కలెక్టర్ సుమిత్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యం వలన ఏవైనా ఇబ్బందులున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. మామిడి పంటను పూర్తిగా కొనుగోలు చేసేవరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రెండ్రోజులైనా రైతులు వేచివుండి పంటను కాటా వేయగానే నమోదు చేసుకోవాలన్నారు. అలా చేయని పక్షంలో సబ్సిడీ అందదని చెప్పారు.తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష, వ్యవసాయ అధికారిణి సంగీత తదితరులు పాల్గొన్నారు.
గుడిపాల, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్అండ్ఇన్స్, సీకే పల్లె వద్ద వున్న తాసా జ్యూస్ ఫ్యాక్టరీలను కలెక్టర్ సుమిత్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యం వలన ఏవైనా ఇబ్బందులున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. మామిడి పంటను పూర్తిగా కొనుగోలు చేసేవరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రెండ్రోజులైనా రైతులు వేచివుండి పంటను కాటా వేయగానే నమోదు చేసుకోవాలన్నారు. అలా చేయని పక్షంలో సబ్సిడీ అందదని చెప్పారు.తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష, వ్యవసాయ అధికారిణి సంగీత తదితరులు పాల్గొన్నారు.